TSPSC గ్రూప్ 1: ప్రణాళిక, పట్టుదల, స్థిరత్వం
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ – 1 స్థాయి లో 503 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొరకు ప్రతిష్ఠాత్మకంగానిర్వహిస్తుంది. ఈ పరీక్ష యొక్క ప్రిలిమ్స్ అక్టోబర్ లో జరిగింది మరియు దీని మాస్టర్కీ మరియు విద్యార్థుల OMR కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికేవిద్యార్థులకు ఒక అవగాహన వచ్చి ఉండాలి మెయిన్స్ కి అర్హత పొందుతున్నారో లేదో.ఒకవేళ ఇంచుమించు అర్హత సాధిస్తారు అనే ఆలోచన ఉన్నా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టడం సరైననిర్ణయం. ఎందుకంటే ఒకవేళ అర్హత పొందితే పరీక్ష దగ్గరైనప్పుడు ఇంకో 15 రోజులు ఉండిఉంటే నేను ఇంకా మెరుగ్గా రాసేవాడిని/ రాసేదాన్ని అన్న భావన రాకూడదు. అలా అప్పుడుఉంటే జీవితాంతం అవకాశం తప్పింది అన్న బాధ వెంటాడుతుంది. TSPSC సమాచారం ప్రకారం మెయిన్స్ ఫిబ్రవరి లో నిర్వహించడానికి సమాయత్తం అవుతుంది. ప్రిలిమ్స్ పరీక్షఆశావాహులలో సీరియస్ గా లేని వారిని తొలగించడానికి ఒక ఎలిమినేషన్ వంటిది. మెయిన్స్ పరీక్షలోనే అసలైన పోటీ ఉంటుంది. విద్యార్థి యొక్క విషయ పరిజ్ఞానం, స్పష్టత, అవగాహన మరియుసమయ నిర్వహణా సామర్థ్యం పూర్తిగా పరీక్షించబడుతుంది. అందువల్ల ఒక విద్యార్థి విజయవంతం అవ్వాలంటే సరైనప్రణాళిక, స్థిరత్వంతో ఎక్కువ కాలం పాటు పట్టుదల తో కష్టపడే తత్వం కలిగి ఉండాలి
ప్రిపరేషన్ ప్రణాళిక- భగవద్గీత వంటిది
మెయిన్స్ పరీక్ష లో మొత్తం ఆరుపేపర్లు మరియు ఇంగ్లీష్ అర్హత పరీక్ష, ఒక్కో దానిలో మూడు సెక్షన్లు, ఒక్కో సెక్షన్లో అయిదు యూనిట్లు ఉంటాయి. ఇంత విస్తృత సిలబస్ పై పట్టు సాధించడానికి ప్రణాళికలేకపోతే విద్యార్థి ప్రిపరేషన్ లో దారి తప్పే అవకాశం లేకపోతే చదవలేక నిరుత్సాహపడేఅవకాశం ఉంటుంది. ఈ ప్రణాళిక లో మూడు భాగాలు ఉంటాయి. అవి దీర్ఘ కాలిక ప్రణాళిక,మధ్యకాలిక ప్రణాళిక మరియు రోజు వారీ ప్రణాళిక. దీర్ఘ కాలిక ప్రణాళికలో ఏ సబ్జెక్టుఎప్పుడు చదవాలి,దేని మీద ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి గురించి, మధ్యకాలికప్రణాళిక లో ఏ సబ్జెక్టు ఎన్ని రోజులు చదవాలి చదివే సమయం లో ఆ సబ్జెక్టు పరీక్షలుఎప్పుడెప్పుడు రాయాలి, మళ్ళీ రివిజన్ సులువైన పద్దతి లో ఎలా చేయాలి అనేవి, రోజువారీ ప్రణాళిక లో ఎన్ని అంశాలు చదవాలి , ఎన్ని గంటలు మరియు ఎప్పుడెప్పుడు చదవాలి,జవాబు రాసే విధానం ఎలా మరియు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి అనేవి కలిగి ఉండాలి. ప్రతీరోజూ ప్రణాళికాబద్ధం గా చదివితే గ్రూప్-I లో సునాయాసంగా విజయం సాధించవచ్చు.
స్థిరత్వం- విజయానికి మూలం
ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కి 1:50 నిష్పత్తి లో 25,150 మంది ఎంపిక అవుతారు. కానీ ఈ 25.150 లో ఎంత మంది503 లో ఉంటారు అనేది స్థిరత్వంగా ఎక్కువ కాలం పట్టుదలతో కష్టపడే తత్వం పైనేఆధారపడి ఉంటుంది. చాలా మంది TSPSC పరీక్ష వాయిదా వేస్తుందనే దృక్పధంతో సమయాన్ని వృధా చేస్తున్నారు. పరీక్ష ఆ సమయానికిజరిగితే వీరు నష్టపోయే అవకాశం ఉంది అందువల్ల మీ ప్రిపరేషన్ ప్రణాళిక మరియు మీలోపట్టుదల సడలనివ్వద్దు. ఇలా చదివితే పరీక్ష అదే సమయానికి జరిగితే చక్కగా రాయచ్చుఅదే వాయిదా పడితే ఇదే అవకాశం గా ఇంకో రెండూ సార్లు రివిజన్ చేసుకోవచ్చు మరియు మీర్యాంకు మెరుగుపరుచుకోవచ్చు. రాబోయే 5-6 నెలలు స్థిరత్వంతో ప్రిపరేషన్ చేసే సామర్థ్యంకలిగి ఉండే విధంగా మిమ్మల్ని మీరు సంసిద్ధులను చేసుకోండి.
మెయిన్స్- చదివే విధానం
మెయిన్స్ లో మీ విషయావగాహనసుస్పష్టంగా తెలియజేయాలి. అందుకు ప్రతీ సబ్జెక్టు క్షుణ్ణంగా చదవడమే కాదు చదివిందిపరీక్షలో వ్యక్తపరచాలి కూడా. దీని కోసం జవాబురాసే పద్ధతి ని ప్రాక్టీస్ పలు మార్లు ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష లో మీకు 180నిమిషాలలో 15 ప్రశ్నలు రాయాలి. అందువల్ల ప్రతీ ప్రశ్నకు 12 నిమిషాల లెక్కన పూర్తిస్థాయిలో జవాబు రాయాలంటే విషయ పరిజ్ఞానం మరియు రాసేటప్పుడే అంశాలు క్రమానుసారంగాఅమార్చుకోవడం రావాలి మరియు సాధన తోనే ఇది సాధ్యపడుతుంది. రోజు వారీ ప్రణాళిక లోవ్రాయడం సాధన కచ్చితంగా చేయాలి. రెండూ వారాలలో మీరు తేడా గమనిస్తారు. మరి రోజంతాఅదే అంశం చదివితే ఇతర సబ్జెక్టు లకు సమయం సరిపోదు కదా అంటే రోజుని కూడా భాగాలుగాచేసుకుని రివిజన్ కొరకు 40% సమయం , కొత్త అంశం (తెలంగాణా ఉద్యమం వంటివి) 50% మరియురైటింగ్ ప్రాక్టీస్ 10% లెక్క విభజించుకోవాలి. అందుకే ప్రణాళిక ఎంతో ముఖ్యం. ప్రతీసబ్జెక్టు ఇప్పుడు మొదటి నుండి చదవడం కుదరదు. ప్రిలిమ్స్ లో అర్హత పొందుతున్నారుఅంటే మీరు సబ్జెక్టు ఒక సారి చదివి ఉంటారు. అందువల్ల ఇప్పుడు చదివేటప్పుడు ఆ సమయంకంటే తక్కువ పట్టేలా రివిజన్ చేయాలి మరియు వ్రాయడం మీద ఎక్కువగా గురి పెట్టాలి.కొత్త సబ్జెక్టు ఎక్కువ సేపు చదివి అది అయ్యాక తక్కువ సమయం లో రివిజన్ ముగించాలి.అప్పుడే ఇంత విస్తృత సిలబస్ పూర్తి చేయగలరు.
25,150 మంది లో మీరు ఎలా ప్రత్యేకం
ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన ప్రతీ విద్యార్థిఎంతో కొంత విషయ పరిజ్ఞానం కలిగి ఉంటారు. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక జవాబు రాస్తారు. కానీవారి లో మీరు ఎలా ప్రత్యేకం. జవాబు లో విషయ వర్గీకరణ, వివిధ రకాల జవాబులనిర్మాణం, వివరించండి, విశ్లేషించండి వంటిప్రశ్నాపదాలకి తగ్గట్టు జవాబు నిర్మాణం, తెలంగాణాకు సంబంధించిన అంశాలు జోడించడం, కరెంట్అఫైర్స్ ను మీ జవాబులలో అవసరమైన చోట అంతర్లీనంగా వ్యక్తపరచడం వంటివి చేస్తేనే మీరుఇతరుల కంటే ముందు వరుస లో ఉంటారు. ఇది ప్రతీ రోజు ప్రణాళికాబద్ధం గా విషయానుసారంసాధన చేస్తేనే అలవాటు అవుతుంది
ప్రిపరేషన్ యందుసవాళ్ళు-సమాధానాలు
తెలుగు పుస్తకాల లభ్యతఅన్నిటికంటే పెద్ద సమస్య లా తెలుగు మాధ్యమం వారికి అనిపిస్తుంది. కానీ అది సరికాదు. ఇంగ్లీష్ మాధ్యమం వారికి వివిధ రకాల ధృక్పధాలతో పుస్తకాల లభ్యత వాస్తవమేకానీ విజయానికి వివధ రకాల పుస్తకాల కంటే ఒకే పుస్తకం పలు సార్లు రివిజన్ చేశిపట్టు సాధించడం మీదే ఉంటుంది. ధృక్పధంఎప్పుడైన కొత్త గా ఉంటేనే మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కావున తెలుగు మధ్యమం వారుఒకే పుస్తకం ఎక్కువ సార్లు చదవడానికి ప్రయత్నిస్తూ కరెంట్ అఫ్ఫైర్స్ మీద అవగాహన పెంచుకుంటే విజయం లభించే అవకాశాలు ఎక్కువ
మరొక ముఖ్య సమస్య ఎక్కువప్రశ్నలకు జవాబులు రాయలేకపోవడం. ఇది సమయ నిబంధన పెట్టుకుని రోజూ సాధన చేస్తేనేఅవుతుంది. ఒక ప్రశ్న రాసేటప్పుడు దాని నిర్మాణం ముందుగానే మెదడు లో ఏర్పరుచుకునిఅన్ని అంశాలు స్మృశించే విధంగా సాధన చేయాలి. అప్పుడు మొదట్లో రాసే ప్రశ్నలే కాదుఅన్ని ప్రశ్నలు అడిగిన విధంగా రాయగలరు.
మరొక జఠిల సమస్య తెలంగాణ కరెంట్అఫైర్స్ ఏ విధంగా సమకూర్చుకోవాలి. దీనికి రోజు వారీ పేపర్చదవడం మరియు నోట్స్ రాసుకోవడం మంచిది. రోజు వారీ పేపర్ చదివితే సంపాదకీయం మరియువ్యాసాలలో రాసే విశ్లేషనాంశాలు ఉపయోగపడతాయి
కలెక్టర్ స్థాయి అధికారి ఆలోచనావిధానం ప్రణాళికా పద్ధతులు అలవారుచుకోవాల్సిన అవసరం విద్యార్థులలో ఉంది. వివేకానందునిమాటలలో వెయ్యి అడుగులు కూడా ఒక్క అడుగు తోనే మొదలవుతుంది అనేది ఆచరణలోని పెట్టినేటి నుంచైనా మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. విద్యార్థి తన యొక్క సమయాన్నిసద్వినియోగం చేసుకుంటూ ఎంతో విలువైన అవకాశాన్ని రెండూ చేతులతో అందుకుని స్థిరత్వంమరియు పట్టుదల తో ఈ గ్రూప్ –I లో విజయవంతం కావాలని మరియు మీరు అలవరుచుకున్న క్రమశిక్షణ జీవితాంతం మీరు కొనసాగించి మంచివ్యక్తిగా నిలవాలని ఆకాంక్ష
This is some Parliament Live Updates: Lok Sabha passes Bill to link voter ID, Aadhaar cards amid protest by Oppositione text inside of a div block.
- The Opposition claimed that it would be a violation of the Constitutional rights of citizens and would violate their right to privacy if Aadhaar is connected to the electoral rolls. The Opposition demanded the rollback of the Bill.
- Parliament Live Updates: Lok Sabha passes Bill to link voter ID, Aadhaar cards amid protest by Opposition
- For people who would not be able to furnish their Aadhaar number at the moment will be allowed to produce other documents to authenticate their identity.
- The Opposition claimed that it would be a violation of the Constitutional rights of citizens and would violate their right to privacy if Aadhaar is connected to the electoral rolls. The Opposition demanded the rollback of the Bill.
Read more...
Read more...

This is some Parliament Live Updates: Lok Sabha passes Bill to link voter ID, Aadhaar cards amid protest by Oppositione text inside of a div block.
- The Opposition claimed that it would be a violation of the Constitutional rights of citizens and would violate their right to privacy if Aadhaar is connected to the electoral rolls. The Opposition demanded the rollback of the Bill.
- Parliament Live Updates: Lok Sabha passes Bill to link voter ID, Aadhaar cards amid protest by Opposition
- For people who would not be able to furnish their Aadhaar number at the moment will be allowed to produce other documents to authenticate their identity.
- The Opposition claimed that it would be a violation of the Constitutional rights of citizens and would violate their right to privacy if Aadhaar is connected to the electoral rolls. The Opposition demanded the rollback of the Bill.
Read more...
